సంఘాలన్నా, నాయకులన్నా ఇష్టముండదు
ఎవరైనా ఎదుగుతున్నా భరించరు
ప్రశ్నిస్తే అనవసర కేసులు, వేధింపులు
ఈటల అరాచకాలు సహించలేకపోయాం
స్పష్టం చేసిన హుజూరాబాద్ నియోజకవర్గ యువత
మంత్రి గంగుల సమక్షంలో వంద మంది టీఆర్ఎస్లో చేరిక
ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి
ఈటల రాజేందర్ బీజేపీలో చేరుడు నాకు నచ్చలేదు..
కరీంనగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ):నేను చాలా సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తున్న. బీజేవైఎం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన. ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మా సహచరులను అనేక ఇబ్బందులు పెట్టిండు. అనేక అరాచకాలు సాగించిండు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన మా నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. టీఆర్ఎస్ నుంచి బయటికి పంపిస్తే ఇప్పుడు బీజేపీలో చేరిండు. ఇది నాకు నచ్చలేదు. అందుకే బీజేపీ నుంచి బయటికి వచ్చిన. టీఆర్ఎస్లో చేరిన.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అరాచకాలను సహించలేకపోయాం. ఆయనకు యువకులు, విద్యార్థులంటే ఇష్టం ఉండదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితులమయ్యాం. అందుకోసమే టీఆర్ఎస్లో చేరుతున్నాం’ అంటూ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువజన నాయకులు స్పష్టం చేశారు.
ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా, శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో సుమారు 100 మంది కార్యకర్తలు, పలువురు నాయకులు వడ్లూరి విజయ్కుమార్, ములుగు పూర్ణచందర్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా వారు ఈటల తీరును ఎండగట్టారు.
చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు..
ఈటల రాజేందర్ అంటే బయట పెద్ద లీడర్ అనుకుంటరు. కానీ, టీఆర్ఎస్లో ఉన్నడు కాబట్టే ఇన్ని రోజులు గెలుస్తూ వస్తున్నడు. చెప్పుకోదగిన అభివృద్ధి పని ఒక్కటి కూడా చేయలేదు. నియోజకవర్గంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నరు. వారికి కనీసం ఉపాధి కల్పించే పనులు కూడా చేపట్ట లేదు. ఆరు సార్లు గెలిచానని గొప్పగా చెప్పుకోవడం దేనికి. ఈటలకు ఒటమి చవిచూపేందుకే మేమంతా టీఆర్ఎస్లో చేరుతున్నాం. నేను ఏఐఎస్బీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న. టీఆర్ఎస్లో కూడా మంచి స్థానం ఉంటుందని భావిస్తున్న.
ఈటలది నియంత పోకడ..
ఈటల రాజేందర్ది నియంత పోకడ. ఆయన ముందు ఎవరూ ఎదగవద్దు. ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించవద్దు. నేను ఏఐఎస్బీ స్టేట్ కన్వీనింగ్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్న. నాకు ఆ పార్టీలో మంచి స్థానం ఉంది. కానీ, ఈటల ఓటమిని చవిచూడాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్లో చేరిన. హుజూరాబాద్లో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. ఆరుసార్లు గెలిచానని గొప్పగా చెప్పుకునే ఈటల చేసిన అభివృద్ధి ఇదని ఎందుకు చూపలేక పోతున్నరు. ఈసారి ఆయన ఘోరంగా ఓడి పోవడం ఖాయం.
అనవసర కేసులతో వేధించిండు
నేను తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసిన. ఈటల రాజేందర్కు మాలాంటి విద్యార్థి సంఘాలు అంటే అస్సలు నచ్చవు. అనవసరమైన కేసులు పెట్టించి వేధించేటోడు. ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నామని మాతోటి విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందిపెట్టిండు. ఆయన టీఆర్ఎస్లో ఉన్నపుడు ఏ విద్యార్థి, యువజన సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా అక్రమంగా కేసులు పెట్టించేటోడు. అందుకే ఇప్పుడు ఆయన ఓటమే లక్ష్యంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నం.