పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
రెండు ఆక్సిజన్ అంబులెన్స్లు ప్రారంభం..
మంథనిలో 8074839929, కాటారంలో 8074879299 హెల్ప్లైన్ నంబర్లు
మంథని టౌన్, మే 18: నియోజకవర్గ ప్రజలను ఆపదలో ఆదుకునేందుకే కేటీఆర్ కొవిడ్ హెల్ప్ లైన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని దవాఖానలో చేర్పించేందుకు రెండు ఆక్సిజన్ అంబులెన్స్లను ప్రారంభించామని పేర్కొన్నారు. మంథనిలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో కేటీఆర్ కొవిడ్ హెల్ప్ లైన్ ఆక్సిజన్ అంబులెన్స్ను మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు సౌజన్యం తో రెండు జిల్లాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకే కేటీఆర్ నామకరణంతో కొవిడ్ హెల్ప్ లైన్ అంబులెన్స్లను ప్రారంభించామన్నారు. మంథనిలోని అంబులెన్స్ మంథని, కమాన్పూ ర్, రామగిరి, ముత్తారం మండలాల ప్రజల కోసం, కాటా రం సబ్ డివిజన్లో కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల ప్రజల కోసం కాటారంలో మరో అంబులెన్స్ అందుబాటులో ఉంచామన్నారు. మంథనిలో 8074839929, కాటారంలో 8074879299 హెల్ప్ లైన్ నెంబర్లుగా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు ఎగోలపు శంకర్గౌడ్, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, కౌన్సిలర్ వీకే. రవి తదితరులు పాల్గొన్నారు.