కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
ఐలాపూర్లో కల్యాణ మండపం ప్రారంభం
కోరుట్ల రూరల్, అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం కులసంఘాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మండలంలోని ఐలాపూర్ గ్రామం లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆదివారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి కుల సంఘానికీ హైదరాబాద్లో భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కల్యాణ మం డప నిర్మాణానికి 4లక్షలు అందించడమే కా కుండా, మరో 6లక్షలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండప నిర్మా ణం చేపట్టిన సంఘం సభ్యులను అభినందించా రు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఇక్కడ ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ పిడుగు రాధ, ఉప సర్పంచ్ గడప అంజమ్మ, ఎంపీటీసీ చింతకుంట వనిత, సర్పంచుల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజే శ్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, మండలాధ్యక్షుడు చింతకుంట సంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చింతకుంట సాయిరెడ్డి, నాయకులు పిడుగు సందయ్య, గట్ల అనంతస్వామి, హన్మం తు, బండి నరేశ్, నాగునూరి గంగాధర్గౌడ్, గడ ప శంకర్, బొల్లపల్లి శ్రీనివాస్గౌడ్, గుగ్గిళ్ల తుకా రాంగౌడ్, నరేందర్రెడ్డి, వెంకటస్వామి, వికాస్, సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.