కమలాపూర్, అక్టోబర్ 17: ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఆదివారం వంగపల్లి, బత్తినివానిపల్లి, గోపాల్పూర్, శనిగరం, అంబాల గ్రామాల్లో పలు కులసంఘాల నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పాకనే ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం చేస్తరో చెప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళితబంధు పథకం పెట్టి రూ.10లక్షలు ఇస్తున్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీ బంధు పెట్టి బీసీలకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచులు పొడేటి కమలమ్మ-సారయ్య, లడే గోపాల్, పింగిళి రవళి-రంజిత్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ గుర్రం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ మేకల తిరుపతి, నాయకులు పింగిళి ప్రదీప్రెడ్డి, సుందర్రాజ్ యాదవ్, సాంబయ్య, రమేశ్రెడ్డి, కొత్తపల్లి రాజు, మరిగిద్ద రాజు, అజారొద్దీన్, అఫ్జల్ పాల్గొన్నారు.