పండించిన ప్రతి గింజా కొంటాం
సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురండి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం
గంగాధర,మే 17: ‘అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. పండించిన ప్రతి గింజనూ కొనేందుకు ప్రభుత్వం సిద్ధం ఉన్నది’ అంటూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. సమస్యలుంటే అధికారులను సంప్రదించండి.. అంతేకాని మిల్లర్లకు నేరుగా అమ్ముకోవద్దు అని సూచించారు. సోమవారం గంగాధర సింగిల్ విండో కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు. తడిసిన వడ్లను సైతం కొనేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నిబంధనల మేరకు ధాన్యం అమ్మిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తే అధికారులు, మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు వేదికలు కేంద్రాలకు క్లస్టర్ స్థా యిలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని, పంట మార్పిడి, ఆహార , వాణిజ్య పంటల సా గుపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రసాయ ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 65 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు అసత్య ప్రచారాన్ని నమ్మి పరేషాన్ కావద్దన్నారు. గంగాధర, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్లు దూ లం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచ్లు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, నజీర్, జోగు లక్ష్మీరాజం, నేతలు రామిడి సురేందర్, వేముల అంజి, రమణారెడ్డి, అంజయ్య, జారతి సత్తయ్య, అనిల్, ఏడీఏ రామారావు, ఏపీఎం పవన్ ఉన్నారు.