ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండిలో వ్యాక్సినేషన్ పరిశీలన
చొప్పదండి, సెప్టెంబర్ 15: 18 ఏళ్లుపైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా కట్టడికి సహకరించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. చొప్పదండి పట్టణంలో గురువారం ఆయన మొదటి, రెండో డోస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, అందరికీ సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, నాయకులు పెరుమాండ్ల గంగయ్య, మహేశుని మల్లేశం, నరేశ్, వైద్యాధికారి రమాదేవి, ప్రసాద్ పాల్గొన్నారు.
గ్రామాలో..
గంగాధర, సెప్టెంబర్ 16: మండలంలోని కురిక్యాల, రంగరావుపల్లి గ్రామాల్లో గంగాధర పీహెచ్సీ ఆధ్వర్యంలో గురువారం కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు సర్పంచులు మేచినేని నవీన్రావు, పాశం స్వప్న తెలిపారు. కురిక్యాలలో 145 మంది, రంగరావుపల్లిలో 98 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా కట్టడికి సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఇక్కడ నాయకులు పాశం కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 16: కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామంలో చామనపల్లి పీహెచ్సీ వైద్యురాలు శిరీష ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను డీపీవో వీర బుచ్చయ్య పర్యవేక్షించారు. కాగా, 250 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు తెలిపారు. సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, హెల్త్సూపర్వైజర్లు శ్రీనివాస్రెడ్డి, బాలయ్య, ఏఎన్ఎం పుష్ప, పంచాయతీ కార్యదర్శి సుస్మిత, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.