ఆక్సిజన్తో కూడిన రెండు అంబులెన్స్ల ఏర్పాటుకు కృషి
పదవులతో సంబంధం లేకుండా సేవ చేస్తా
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథనిలో మరో వైకుంఠరథం ప్రారంభం
మంథని టౌన్, మే 16: కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గ ప్రజలను ఆపత్కాలం లో ఆదుకునేందుకు కేటీఆర్ కొవిడ్ హెల్ప్లైన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వెల్లడించారు. మంథని, కాటారం కేంద్రంగా ఆక్సిజన్లతో కూడిన రెండు అంబులెన్స్లను ఏర్పాటు చేసి ప్రజలను కరీంనగర్, వరంగల్లోని దవాఖానలకు ఉచితంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. 2014 మే 16న ఆయన మంథని ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా అప్పటి నుంచి అదే రోజును తన పుట్టినరోజు గా పుట్ట మధూకర్ జరుపుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంథనిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు వైకుం ఠ రథాన్ని భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న వేళ ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ‘పుట్ట లింగమ్మ ట్రస్టు సౌజన్యంతో మంథని నియోజకవర్గంలో రెండు మూడు రోజుల్లో ‘కేటీఆర్ కొవిడ్ హెల్ప్ లైన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
మంథని కేంద్రంగా ఉండే అంబులెన్స్ కరీంనగర్ వరకు, కాటారం కేంద్రంగా ఉండే అంబులెన్స్ వరంగల్ వరకు ఎమర్జెన్సీగా ఉండే వారిని ఉచితంగా తీసుకెళ్లి దవాఖానల్లో చేర్చుతుందన్నారు. కేటీఆర్ కొవిడ్ హెల్ప్ లైన్ ద్వారా వైద్యులను సైతం భాగస్వాములను చేస్తూ కరోనా వైరస్ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉచితంగా సలహాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంథనిలో 8074839929, కాటారంలో 8074879299 హెల్ప్ లైన్ నంబర్లు పని చేస్తాయన్నారు. పదవులతో సం బంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. అనంత రం పుట్ట దంపతులను భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, రాకేశ్ శాలువాతో సత్కరించారు. అంబేద్కర్చౌరస్తాలో టీఆర్ఎస్ కార్యకర్తలు పటాకలు కాల్చారు. ఇక్కడ మంథని, రామగిరి, ముత్తారం ఎంపీపీలు కొండ శంకర్, ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్, జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు ఎగోలపు శంకర్గౌడ్, మండల కన్వీనర్ ఆకుల కిరణ్, కౌన్సిలర్లు, నాయకులు వీకే. రవి, కర్రు లింగయ్య, నక్క నాగేంద్ర తదితరులు ఉన్నారు.