గొర్రెల పంపిణీతో సత్ఫలితాలు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఇల్లందకుంట, జూలై 15: గొల్ల, కుర్మల అభ్యున్నతే ధ్యేయంగా, గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన గొల్ల, కుర్మలతో సమావేశమై, మాట్లాడారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా మాంసం ఉత్పత్తి లేక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, కానీ గొర్రెల పంపిణీతో పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో దిగుమతి తగ్గిందని, ఉత్పత్తి పెరుగుతున్నదని పేర్కొన్నారు. గొర్రెల యూనిట్లు పెండింగ్లో ఉన్న వారందరికీ త్వరలోనే పంపిణీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గొల్ల, కుర్మల హక్కుల వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కనుమల్ల గణపతి, రవియాదవ్, వెంకటస్వామి, వీరస్వామి, కుమార్, రాములు, తిరుపతి, రాజయ్య, మహిపాల్, గట్టయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.