చొప్పదండి మండలంలో కలెక్టర్ శశాంక ఆకస్మిక పర్యటన
రుక్మాపూర్లో ఈజీఎస్ పనుల్లో ఆలస్యంపై అసంతృప్తి
సర్పంచ్, ఏపీవో, కార్యదర్శి సస్పెన్షన్
చొప్పదండి తహసీల్ కార్యాలయం, పీహెచ్సీ సందర్శన
చొప్పదండి,జూన్15: విధినిర్వహణలో నిర్లక్ష్యం పై కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రుక్మాపూర్లో మంగళవారం ఆకస్మికం గా పర్యటించారు. నర్సరీలోని మొక్కలు, వైకుంఠధామం పనులను పరిశీలించారు. గడువు ముగిసినా పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్పంచ్ చిలుక లింగయ్య, ఉపాధి హామీ ఏపీవో రాజు, పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈజీఎస్ రికార్డుల నిర్వహణ, పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యంపై ఉపాధి హామీ ఏపీ వో రాజుపై అసహనం వ్యక్తం చేసి విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామం లో చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్డులో చెత్తను వేర్వే రు చేసేలా చూడడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన గ్రామ కార్యదర్శి అరుణ్కుమార్పై వేటు వేశారు.
గ్రామాల్లో శానిటేషన్, పల్లెప్రకృతివనాల్లో మొ క్కల పెంపకంలో అలస త్వం వహిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అంతకుముందు మండలకేంద్రంలోని తహసీల్దా ర్ కార్యాలయాన్ని సందర్శించారు. రూ.10 లక్షలతో చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో మొక్కలు నాటారు. తదనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రా న్ని సందర్శించారు. జిల్లాలో కరోనా పాజిటివిటి సంఖ్య ఎక్కువ ఉన్న మండలాల్లో చొప్పదండి కూడా ఉన్నదని, మండలంలో కరోనానిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, వాక్సినేషన్ను తొం దరగా పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీపీవోవీరబుచ్చయ్య, జిల్లాగ్రామీణాభివృద్ధ్ది అధికారి శ్రీలత, ఎంపీపీ చిలుక రవీందర్, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూ ప, మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఉన్నారు.
నిర్లక్ష్యం ఫలితం..ముగ్గురిపై వేటు..
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం రుక్మాపూర్ గ్రామ కార్యదర్శి అరుణ్కుమార్, అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, సర్పంచ్ చిలా లింగయ్యను విధు ల నుంచి తొలగించినట్లు కలెక్టర్ శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం కలెక్టర్ రుక్మాపూర్లో నర్సరీ, వైకుంఠధామం , సెగ్రిగేషన్ షె డ్డు నిర్వహణ పనులను పరిశీలించారు. అలసత్వం చేసిన వీరిపై వేటు వేశారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ను మందలించారు. పల్లెప్రగతి పనులపై ఎన్నోసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి సకాలంలో పూర్తి చేయించాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతోనే బాధ్యులపై చర్యలు తీసుకున్న ట్లు కలెక్టర్ చెప్పారు. ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ ముద్దసాని చిరంజీవి పాల్గొన్నారు.