తాగునీటి కొరత లేకుండా చూడాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
భగీరథ నీటి సరఫరా, భూనిర్వాసితుల సమస్యలపై సమీక్ష
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మం దిరంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీటి సరఫరా, శ్రీ రాజరాజేశ్వర జలాశయం భూ నిర్వాసితుల సమస్యలపై సమీక్షించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిర్వహణ లోపంతో వారం నుంచి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వినోద్కుమార్ వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించి ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమస్య పరిష్కారానికి గాను మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈఎన్సీ కృపాకర్ గురువారం జిల్లాకు వస్తున్నారని తెలిపారు. ఎస్సారార్ జలాశయంలో 15 టీఎంసీలు నిల్వ ఉందని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి ని యోజకవర్గాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు క లుగకుండా చూడాలన్నారు. ఇక్కడ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, గ్రిడ్ ఎస్ఈ రవీంద్ర, ఈఈ విజయ్కుమార్, ఇంట్రా ఈఈ జానకి, టీఆర్ఎస్ కోనరావుపేట మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, జడ్పీటీసీలు వాణీ, రవి పాల్గొన్నారు.