జమ్మికుంట, అక్టోబర్ 13: ఆత్మగౌరవానికి అవకాశవాదానికి జరుగుతున్న హుజూరాబాద్ ఉప పోరులో పేదింటి బిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. బుధవారం పట్టణంలోని 29, 30వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. అనంతరం ఓసీ సమాఖ్య నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పొలాడి రామారావు మాట్లాడారు. ఈటల రాజేందర్ వ్యక్తిగత స్వార్థంతోనే బీజేపీలో చేరిన అవకాశవాదని విమర్శించారు. బీజేపీలో చేరి హుజూరాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు తగిన బుద్ధి చెప్పి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటాలని పొలాడి రామారావు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సింగిరెడ్డి సమ్మిరెడ్డి, కోరుకంటి సదాశివరెడ్డి, బండ లక్ష్మారెడ్డి, పొనగంటి తిరుపతిరెడ్డి, పుల్లూరి ప్రభాకర్రావు, దుబ్బా శ్రీనివాస్, ఉపేందర్, గొట్టెముకుల రవీందర్రావు, కటూరి చంద్రారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మనోహర్రావు, రాజిరెడ్డి, జనార్దన్రెడ్డి తదితరులున్నారు.