గోదావరిఖని, సెప్టెంబర్ 13: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో టీఆర్ఎస్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేర కు డివిజన్ ఇన్చార్జి వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఫైవింక్లయిన్ పట్టణ కమిటీ ఇన్చార్జి తోడేటి శంకర్ గౌడ్, పట్టణాధ్యక్షుడు బొడ్డు రవీందర్తో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అనుముల కళావతి, దాసరి ఎల్లన్న, తోడేటి స్వరూప, రాజేశ్వరి, బొడ్డు రాజేశం, సాతురి శ్రీనివాస్, ఎరుకల శ్రీహరి, నాతరి మల్లేశ్, గండ్ల సునీల్, తోడేటి శ్రావణ్, అంబాల శంకర్, అజిత్ సింగ్, పైడాకుల సంపత్, రమేశ్, ఆనంద సంజీవ్, జగ్గయ్య, పోశం, కొంరయ్య, తిరుపతి, మంద మొగిలి, నర్సయ్య, సాగర్ తదితరులు ఉన్నారు.
డివిజన్ నూతన కమిటీ
డివిజన్ అధ్యక్షుడిగా బొడ్డు రాజేశం, మహిళా అధ్యక్షురాలిగా తోడేటి స్వరూప, బీసీ అధ్యక్షుడిగా సదానందం, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడిగా బోనగిరి కొంరయ్య, క్రిస్టియన్ అధ్యక్షుడిగా మంథని సాగర్, యూత్ అధ్యక్షుడిగా శ్రావణ్, కార్మిక అధ్యక్షుడిగా కొమ్ము సంజీవ్ను ఎన్నుకున్నట్లు ఇన్చార్జి వడ్డేపల్లి శంకర్ తెలిపారు.
జ్యోతినగర్(రామగుండం), సెప్టెంబర్ 13: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు సోమవారం రామగుండంలోని 21వ డివిజన్ టీఆర్ఎస్ నూతన కమిటీ ఎంపిక డివిజన్ కార్పొరేటర్ అమ్రీన్ ఫాతిమా ఆధ్వర్యం లో నిర్వహించారు. ఎంపికకు టీఆర్ఎస్ రామగుండం పట్టణ డివిజన్ కమిటీల ఇన్చార్జి పీటీ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై ప్రకటించారు. డివిజన్ అధ్యక్షుడిగా షేక్ అలీమ్, ప్రధాన కార్యదర్శిగా దుస్స నరేశ్, అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ రామగుండం పట్టణాధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు సలీం బేగ్, శిరంశెట్టి శ్రీనివాస్, ఇసంపల్లి తిరుపతి, చింతకింది తిమోతి, దుర్గం రాజు, మాడిశెట్టి రవి, గూడూరు వెంకటస్వామి తదితరులు ఉన్నారు.