కమాన్చౌరస్తా, ఏప్రిల్ 13: జిల్లా కేంద్రంలో ప్రజలు మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కుటుంబసభ్యులంతా కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఇండ్లల్లో ఉగాది పచ్చడి, బూరెలు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ ప్రసాద వితరణ చేయలేదు. అలాగే, పంచాంగ శ్రవణంలో సందడి కనిపించలేదు. కాగా, మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరాలయంలో ధర్మకర్తలు, ఈవో పీచర కిషన్రావు, సాయినగర్ విజయగణపతి సాయిబాబా ఆలయంలో ఆలయ చైర్మన్ అయిందాల లక్ష్మయ్య, ధర్మకర్తలు చిట్టుమల్ల కొండయ్య, నలువాల ప్రకాశ్, డాక్టర్ అయిందాల వినయ్, ఈవో ఎండపల్లి మారుతి, సిబ్బంది పిట్టల అంజయ్య, గుడికాడి శ్రీనివాస్, రఘు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో ఈవో నాగుల అనిల్కుమార్, అర్చకులు చౌటి రామశర్మ, కార్తీక్శర్మ, రాజేశ్వరశర్మ, క్లర్క్ శ్రావణ్, భక్తులు పాల్గొన్నారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబజార్ గౌరీశంకరాలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించారు. వావిలాలపల్లి రామాలయంలో జరిగిన వేడుకల్లో అర్చకుడు సత్యనారాయణాచార్యులు, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు మేచినేని అశోక్రావు, అధ్యక్షుడు మేచినేని నారాయణరావు పాల్గొన్నారు. బొమ్మకల్ రోడ్లోని యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో శ్రీవారికి ఉగాది ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్వవైదిక సంస్థానం కులపతి, ఉపకులపతులు శ్రీ భాష్యం విజయసారథి, ఎస్బీ వరప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం గంజ్లోని వరసిద్ధి వినాయక ఆలయంలో మంగళంపల్లి వేణుగోపాల్శర్మ శ్రీరామనవమి ఉత్సవాలను ప్రారంభించారు. సప్తగిరి కాలనీ కోదండరామాలయంలో ఆలయ చైర్మన్ గౌతమ రావు, సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిద్దెపెరుమాండ్ల ఆలయంలో రామక శంకరశర్మ, చైర్మన్ కలర్ సత్తన్న, ఈవో మారుతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.