కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
పదవులు రానివారు నిరాశ పడవద్దు
ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల రూరల్/రాయికల్ రూరల్, సెప్టెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. పట్టణ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పట్టణ వైద్య భవన్లో 40, 41, 44, 45, 46 వార్డుల కమిటీలు, అనుబంధ కమిటీలను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వైశ్య భవన్లో ప్రతిష్టించిన వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం అనంతారం సంఘమిత్ర ఫంక్షన్ హాల్ లో అనంతారం, గుట్రాజ్పల్లి, గుల్లపేట, సంగంపల్లి, సోమన్పల్లి, కల్లెడ, తక్కళ్లపెల్లి, హబ్సీపూర్ గ్రామాల కమిటీలను ఎన్నుకున్నారు. రాయికల్ పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్లో ఎన్నికైన వారికి పత్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సర్పం చ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని పదవుల కైవ సం చేసుకున్న పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఈ ఘన త టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త నడవాలన్నారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని తెలిపారు. గ్రామ, మండల కమిటీల్లో పదవులు రానివారు నిరుత్సాహ పడవద్దని, కష్టపడి పనిచేస్తే భవిష్యత్లో మంచి అవకాశాలు వస్తాయన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలనే సంకల్పంతో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే లక్ష్యంగా.. ప్రజా సేవకే తన జీవితం అంకితమని చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, పేద, మధ్య తరగతి జీవితాల్లో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వనిదేనన్నారు. యువత సోషల్ మీడియాలో వస్తు న్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని, పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. తర్వాత సంఘమిత్ర ఫంక్షన్ హాల్లో భోజన విరామ సమయంలో కార్యకర్తలకు ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ వడ్డించారు. కార్యక్రమం లో పట్టణ, మండలాధ్యక్షులు గట్టు సతీశ్, బాల ముకుం దం, ఇన్చార్జి ఎంపీపీలు పాలెపు రాజేంద్ర ప్రసాద్, లావు డ్య సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, పీఏసీఎస్ చైర్మన్ సందీప్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దేశాయి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ముకీద్, టీఆర్ఎస్ రాయికల్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, నాయకులు రవీందర్రెడ్డి, ఎల్లారెడ్డి, దొంతి నాగరాజు, అనుపురం శ్రీనివాస్ గౌడ్, దశరథ రెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.