పేదవాళ్లను పెద్దవాళ్లుగా చేయడమే సర్కారు లక్ష్యం
యాదవుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
మల్లాపూర్/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పేదవాళ్లను పెద్దవాళ్లుగా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శనివారం మల్లాపూర్లో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నస్వామి ఆలయానికి సంఘ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. మండల పరిషత్లో 82మందికి 42లక్షల విలువైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో ని రైతు వేదిక వద్ద 17మంది లబ్ధిదారులకు 17,01,972 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, 32 మందికి 9,61,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యాదవుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని, వారిని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. రెండేండ్లుగా కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ నిర్విరామంగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల ను అందిస్తామని తెలిపారు. అంతకుముందు మల్లాపూర్లో యాదవ సంఘం సభ్యులు డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ఎమ్మెల్యేతో పాటు, రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్కు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం డాక్టర్ సంజయ్ ఇబ్రహీంపట్నం రైతు వేదిక వద్ద మొక్క నాటారు. ఇక్కడ ఎంపీపీలు కాటిపల్లి సరోజన, జాజాల భీమేశ్వరి, జడ్పీటీసీలు సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కంటం భారతి, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కదుర్క నర్సయ్య, సర్పంచ్ నేమూరి లత, పీఏసీఎస్ చైర్మన్లు బాస శ్రావణ్, వేంపేట నర్సారెడ్డి, బద్దం అంజిరెడ్డి, మండలాధ్యక్షులు తోట శ్రీనివాస్, ఎల్లాల ధశరథరెడ్డి, ఆర్బీఎస్ కన్వీకన్ కొమ్ముల జీవన్రెడ్డి, జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, వైస్ ఎంపీపీలు గౌరు నగేశ్, నోముల లక్ష్మారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు మైదాస్ శ్రీనివాస్, ఏనుగు రాంరెడ్డి, పొన్కంటి వెంకట్, యాదవ సంఘం అధ్యక్షుడు సంగ గంగారాజం, సర్పంచులు, ఎంపీటీసీలు, తిమ్మని రాములు, చిన్నారెడ్డి, నేత లు జగన్ రావు, కంటం రమేశ్, నేమూరి సత్యనారాయణ, వూట్నూరి ప్రదీ ప్ కుమార్, జేడీ సుమన్, నేరెళ్ల దేవేందర్, జీవన్, భూమేశ్ రెడ్డి, పుప్పాల నర్సయ్య, జిల్లాల పవన్, గణేశ్, తుకారాం, రాజన్న పాల్గొన్నారు.