అడిగిందే తడవుగా నిధులు ఇస్తున్నరు
ఈటల ఏడేండ్లలో చేయని పనులన్నీ చేస్తున్నరు
మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్లో హాకీ, కబడ్డీ క్లబ్లు, పలు సంఘాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన
హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్11: ఈటల నిర్లక్ష్యంతో ఏ పని కాక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న హుజూరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం పకన రూ.65 లక్షలతో నిర్మించనున్న హాకీ, కబడ్డీ, రిటైర్డ్ ఎంప్లాయీస్, నాయీ బ్రాహ్మణ, కళాకారుల భవన నిర్మాణాలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా వచ్చి భూమిపూజ చేసి, మాట్లాడారు. అన్ని కులాల, మతాల, వర్గాల సంపన్నవర్గాల సంపూర్ణ ప్రగతి టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తమకు ఆత్మగౌరవ భవనాలు కావాలని ఏ సంఘం అడిగినా ఈటల రాజేందర్ పట్టించుకోలేదని, మా వద్దకు వచ్చి చెప్పుకోగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే అవసరమైన నిధులను, స్థలాలను కేటాయించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే కబడ్డీ, హాకీ, విశ్రాంత ఉద్యోగులకు, నాయీ బ్రాహ్మణ, కళాకారుల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేశామన్నారు. అంతేగాక రూ.65 లక్షల నిధులను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన భవన నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. హుజూరాబాద్ కళాకారులు, కవులకు, క్రీడాకారులకు ఎంతో ప్రసిద్ధి అని, అలాంటి ప్రసిద్ధి చెందిన వారిని కూడా ఆదరించక పోవడం ఈటల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, హాకీ, కబడ్డీ, రిటైర్డ్ ఎంప్లాయీస్, నాయీ బ్రాహ్మణ, కళాకారుల సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, తోట రాజేంద్రప్రసాద్, ఉమామహేశ్వర్, కళాకారుల నాయకులు విష్ణుదాసు గోపాల్రావు, కోలుగూరి దేవయ్య, ఎం రమేశ్, కలకొటి కిషన్రావు, కుడికాల ప్రభాకర్, పాషా, రాంరెడ్డి, తాళ్లపల్లి రమేశ్, నాయీ బ్రాహ్మణ నాయకులు శ్రీనివాస్, చక్రపాణి, రాములు, నారాయణ, విజయ్, సంపత్, పలువురు కౌన్సిలర్లు సీనియర్ క్రీడాకారులు ఉన్నారు.