మాదాపూర్ గ్రామస్తుల ఔదార్యం
మృతుడి కుటుంబానికి అండ
కోరుట్ల రూరల్, ఆగస్టు 10 : అనారోగ్యంతో ఇంటి పెద్ద మరణిస్తే అతని కుటుంబానికి ఊరు ఊరంతా ఏకైమ అండగా నిలిచారు. రూ.5 లక్షల 85 వేల ఆర్థికసాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దువ్వా క సంజీవ్(49)కు భార్య మౌనిక, ము గ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు, తల్లిదండ్రులున్నారు. వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కాగా, జనవరిలో సంజీవ్ అనారోగ్యం తో మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తు లు, గ్రా మానికి చెందిన ఆదర్శయూత్ సభ్యులు, చిన్ననాటి మిత్రులంతా కలి సి విరాళాలు సేకరించారు. ఇవి రూ.5.85 లక్ష లు పోగవగా, సంజీవ్ భార్య మౌనికకు రూ.5లక్షలు, తల్లిదండ్రులైన భూమక్క, హన్మంతుల జీవనోపాధి కోసం రూ.85 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారిశెట్టి రాజేశ్, ఉప సర్పంచ్ గడ్డం మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు చేపూరి కృష్ణారెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం ఆదిరెడ్డి,యూత్ సభ్యులు పాల్గొన్నారు.