త్వరలోనే సన్న వడ్లు కొనేలా చర్యలు
అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్
అధికారులు. కేంద్రాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం
హుజూరాబాద్టౌన్, మే 10: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జాప్యం చేస్తే సహించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ప్రసాద్లాల్ హెచ్చరించారు. సోమవారం సా యంత్రం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డివిజన్లోని ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, సివిల్సప్లయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హుజూరాబాద్ డివిజన్లో ఇప్పటి వరకు 3.39లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా ఎప్పటికప్పుడు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తు న్నామని చెప్పారు. రైతులు తెచ్చిన ధాన్యానికి తరుగు పేరిట కోత విధిస్తే సంబంధిత రైస్ మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్యాడీ క్లీనర్ మిషన్తో ధాన్యాన్ని పట్టిన తర్వాతనే మార్కెట్కుగానీ, కొనుగోలు కేంద్రాలకుగానీ తీసుకురావాలని అదనపు కలెక్టర్ రైతులకు సూచించారు. సన్న రకం ధాన్యం హుజూరాబాద్ డివిజన్లో సు మారు 60వేల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు తమకు సంబంధిత అధికారుల ద్వారా సమాచారం ఉందన్నారు. సన్న రకం, తిరస్కరించిన సీడ్ వడ్లను త్వరలో కొనుగోలు చేసేలా క్లీయరెన్స్ ఇస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ఇన్చార్జిలు రైతులను ఇబ్బంది పెట్టకుండా తెచ్చిన వెను వెంటనే దాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్, తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, ఏడీఏ దోమ ఆదిరెడ్డి, వ్యవసాయ అధికారులు, డివిజన్లోని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.
నూతన ఆర్డీవోకు అభినందనలు..
హుజూరాబాద్ ఆర్డీవోగా సీహెచ్ రవీందర్రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారిగా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి రావడంతో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ కే ప్రసన్నరాణి పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువా కప్పి సత్కరించి అభినందనలు తె లిపారు. విధి నిర్వహణలో అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు.