గోదావరిఖని, సెప్టెంబర్ 9: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గణపతి నవరాత్రుల నేపథ్యంలో ప్రజలంతా మట్టి వినాయకులను పూజించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు స్థానిక చౌరస్తాలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఇక్కడ మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, భాస్కర్, బాల రాజ్కుమార్, నాయకులు అడ్డాల రామస్వామి, తానిపర్తి గోపాల్ రావు, దీటి బాలరాజ్, అచ్చవేణు, తోకల రమేశ్, ఎడెల్లి శ్యాం, సురేశ్, సట్టు శ్రీనివాస్, అందె సదానందం, ప్రతాప్, విజయ్కుమార్, నీరటి శ్రీనివాస్ ఉన్నారు.
పెద్దపల్లి జంక్షన్, సెప్టెంబర్ 9: మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ సూచించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేయించిన మట్టి వినాయక విగ్రహాలను గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలో వెయ్యి మట్టి విగ్రహాలను కలెక్టరేట్తో పాటు పెద్దపల్లి, గోదావరిఖని బస్టాండ్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందించామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో ప్రసాద్, పర్యవేక్షకులు తూము రవీందర్, దత్తు ప్రసాద్, నారాయణ, అనుపమరావు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్సిటీ, సెప్టెంబర్ 9: గోదావరిఖని బస్టాండ్లో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిదాస్, తహసీల్దార్ రమేశ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇక్కడ ఆర్ఐ ఫకీరప్ప, వీఆర్వో రాంరెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్ ఉన్నారు.
పర్యావరణహిత..
యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్ 9 : రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్యావరణహిత విగ్రహాలను తయారు చేశారు. పాఠశాల సైన్స్ టీచర్ ప్రశాంత్ కుమార్, ప్రశాంతరాణి ఆధ్వర్యంలో విద్యార్థులు చెక్కపొట్టు, మైదపిండితో విగ్రహాలను తయారు చేసి గ్రామస్తులకు అందజేశారు. నిమజ్జనం చేయడంతో నీటిలోని చేప పిల్లలకు ఇతర జీవులకు ఆహారంగా పని చేస్తుందని చెప్పారు.
జూలపల్లి, సెప్టెంబర్ 9: మట్టి విగ్రహాలు పూజించాలని ‘మీ కోసం’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోడూరి మహేశ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో గురువారం మాట్లాడారు.