జిల్లాలో శాంతితోనే అభివృద్ధి సాధ్యం
ముస్లింలకు 4 వేల రంజాన్ గిఫ్ట్లు మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, మే 9: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషమే సర్కారు ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అతి ముఖ్యమైన పండుగ రంజాన్ అని, కరోనాతో రెండేళ్లుగా ఈ సంబురాలను జరుపుకోలేకపోతున్నామని, ఈ సారి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తున్నదన్నారు. నిరుపేద ముస్లింలు కూడా సంతోషంగా రంజాన్ నిర్వహించుకోవాలనే సీఎం కేసీఆర్ ఈ గిఫ్ట్లను అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని మతాలు, కులాల వారు సమరసంగా కలిసి జీవిస్తున్నారని, శాంతియుత వాతవరణంతోనే జిల్లాలో అభివృద్ధి సాధ్యమవుతున్నదని ఉద్ఘాటించారు. కొందరు మాత్రం చిచ్చుపేట్టే ప్రయత్నాలు చేస్తారని, వాటి ని ఎవరూ పట్టించుకోవద్దని, మత సామరస్యంతో పండుగలను నిర్వహించుకోవాలన్నారు. నియోజకవర్గానికి 4 వేల గిఫ్ట్లు వచ్చాయని, వాటిలో క రీంనగర్కు 3 వేలు, కొత్తపల్లికి 400, కొత్తపల్లి మండలానికి 300, రూరల్కు 300 వచ్చాయన్నా రు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే వీటిని అం దించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, మైనార్టీ సంక్షే మ శాఖ అధికారి మధుసూదన్, ఆర్డీవో ఆనంద్కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.