సబ్ సెంటర్లలో ఓపీ సేవలు ప్రారంభించాలి
రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే వ్యాక్సిన్ ఇవ్వాలి
ప్రైవేట్ వైద్యశాలల్లో బెడ్ల సంఖ్య పెంపునకు అనుమతివ్వాలి
టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ కే శశాంక
విద్యానగర్, మే 7: వైద్య, నోడల్ అధికారులు కరోనా కట్టడికి కలిసికట్టుగా ముందుకుసాగాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 604 ఫీవర్ సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించాలని నిర్దేశించారు. కరోనా లక్షణాలు ఉ న్నవారిని గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందించాలని కోరారు. తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కిట్ల కొరత లేకుండా ముం దస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల వారీగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. సర్వే కొనసాగుతున్న తీరును మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
చేసిన పరీక్షలు, పంపిణీ చేసిన కిట్ల వివరాలను ప్రతిరోజూ సేకరించాలని సూచించారు. జిల్లాలో అన్ని సబ్ సెంటర్లలో కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించాలని ఆదేశించారు. టెలీ మెడిసిన్ సెంటర్ సేవల సమయాన్ని పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డాక్టర్ రవీందర్రెడ్డికి సూచించారు. ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ వార్డుల్లో బెడ్ల సంఖ్య పెంపునకు అనుతివ్వాలని నిర్దేశించారు. ప్రైవేట్ దవాఖానలకు అవసరమైన రెమిడెసివిర్ ఇంజక్షన్లు, మందుల కొనుగోలు ఆర్డర్లను వైద్యాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రోగులకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఆక్సిజన్ డిమాండ్ బాగా ఉన్నందున లీకేజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో 23 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో ఆటోమెటిక్ మెషిన్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. పారిశుధ్యం మెరుగుపై దృష్టిపెట్టాలని కోరా రు.
రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు కోసం తగినంత వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు పక్కాగా సాగేలా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, డాక్టర్ సుధాకర్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, నోడల్ అధికారులు నవీన్ కుమార్, రమేశ్ వీర బుచ్చయ్య, శ్రీధర్, జిల్లా పద్మావతి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.