డీలర్లు సమయపాలన పాటించాలి
ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి
గంభీరావుపేట, ఆగస్టు 5: అట్టడుగు వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కింద నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్మెల తిరుమల్రెడ్డి తెలిపారు. మండలంలోని లింగన్నపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు ఆయనకు పూల మొక్కలు అందించి స్వాగ తం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణ, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వసతులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక నాణ్యతా లోపం లేకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అనంతరం లింగన్నపేట, గోరంటాలలో రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు సమయ పాలన పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, డీఈవో రాధాకిషన్, జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, సీడీపీవో అలేఖ్య, తహసీల్దర్ శ్రీనివాస్, సర్పంచ్ కొలుముల అంజమ్మ, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, ఎంపీడీవో శ్రీనివాస్, ఉపసర్పంచ్ దుబాసి రాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎలుసాని ప్రవీణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ దయాకర్రావు, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, దొంతినేని వెంకట్రావు, కృష్ణమూర్తిగౌడ్, బాల్రెడ్డి, అంజయ్య, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఇంటికే వెళ్లి అందించాలి
వీర్నపల్లి, ఆగస్టు 5: వయో వృద్ధులు, దివ్యాంగుల ఇంటికే రేషన్ బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ సూచించారు. వీర్నపల్లి మండలకేంద్రంలో రేషన్ దుకాణం, గర్జనపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. గత నెలలో 15 క్వింటాళ్ల బియ్యం ఎందుకు పంపిణీ చేయలేదని రేషన్ డీలర్ను ప్రశ్నించారు. అనంతరం గర్జనపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ మాలోత్ భూల, తహసీల్దార్ అబ్దుల్ మజీద్, ఆర్ఐ శ్రీనివాస్, సర్పంచులు దినకర్, రవినాయక్, జగ్మల్, ఉప సర్పంచ్ రవి, సురేశ్నాయక్ తదితరులున్నారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 5: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్మెల తిరుమల్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట సీడీపీవో అలేఖ్య, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీపీ పిల్లి రేణుక, వైద్యాధికారులు ధర్మానాయక్, మానస, డీడీఎం కార్తిక్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్, నాయకులు కిషన్, పరశురాములు, డీటీసీఎస్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.