మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం మండలంలో పర్యటన
ధర్మారం/ పెద్దపల్లి కమాన్, ఆగస్టు 4: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ధర్మారం మండలం బుచ్చయ్యపల్లిలో బుధవారం మంత్రి పర్యటించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. 1.40 కోట్లతో బుచ్చయ్యపల్లి నుంచి ఖిలావనపర్తి వరకు నిర్మించిన బీటీ రోడ్డు, రూ. 12 లక్షల నిధులతో బుచ్చయ్యపల్లిలో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలనే సద్దు దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులతోపాటు హరితహారంలో మొక్కల పెంపకం, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు సమకూరుతున్నాయని వివరించారు. ఈ పథకానికి సీఎం కేసీఆర్ ప్రతి నెలా రూ. 339 కోట్లు నిధులను విడుదల చేయిస్తున్నారని వెల్లడించారు. ఈ నిధులతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని వివరించారు. డీఎంఎఫ్టీ నిధులు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడిశెట్టి కొమురయ్య, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీటీసీ మోతె సుజాత, నందిమేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ధర్మారం ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ఏఎంసీ డైరెక్టర్ బొంగాని తిరుపతి, జిల్లా, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ తదితరులు ఉన్నారు.