అల్లుడే చంపాడని యువతి తల్లిదండ్రుల ఆరోపణ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
రుద్రూర్/ బీర్కూర్, ఆగస్టు 2 : మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. భర్తే చంపాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన జమున(30)కు తొమ్మిదేండ్ల క్రితం రాణంపల్లి గ్రామానికి చెందిన నీరడి సాయిలుతో వివాహం అయ్యిం ది. వీరికి శ్రీవల్లి(6), అక్ష య్ కుమార్(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో రెండు నెలల క్రితం జమున తల్లిగారింటి కి వెళ్లిపోయింది. ఆదివారం రాణంపల్లికి చెంది న పెద్దల సమక్షంలో ఒ ప్పించి జమునను అత్తగారింటికి తీసుకొచ్చారు. సో మవారం ఉదయం జము న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జమునను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు. భర్త నిత్యం కట్నం కోసం వేధించేవాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమున బంధువులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పంచాయితీ పెట్టి ముందుండి జమునను తీసుకొచ్చిన పెద్దలందరిపై కేసు నమోదు చేయాల ని డిమాండ్ చేశారు. జమున తల్లి మెంట పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
మాయమాటలు చెప్పి మోసం..
పది మందిని వెంటబెట్టుకొని వచ్చి, మాయ మాటలు చెప్పి సాయిలు మోసం చేశాడని జమున తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మెంట పోశవ్వ-బాలయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె గంగామణి అలియాస్ జమునకు కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కాగా భర్త ఆమె పై అనుమానం పెంచుకున్నాడని, కట్నం కోసం వేధించేవాడని ఆరోపించారు. సాయిలు ఆదివా రం కుల పెద్దలు, గ్రామపెద్దలను తీసుకొని వచ్చి పంచాయితీ పెట్టించి భార్య, పిల్లలను బాగా చూసుకుంటానని నమ్మ బలికి తీసుకెళ్లాడన్నారు. సోమవారం తెల్లవారు జామున ఫోన్ మాట్లాడుతుండగానే కట్ అయ్యిందని.. అనంతరం మరణవార్త వినాల్సి వచ్చిందని రోదించారు.మరణానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.