ఫర్టిలైజర్సిటీ, జూలై 28: రామగుండం పోలీస్ కమిషనరేట్కు మూడవ, నూతన సీపీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి ఎస్పీగా పని చేస్తున్నారు. మొదట ఏసీబీ జేడీగా కొనసాగుతున్న నాన్ క్యాడర్ ఎస్పీ ఎం.రమణ కుమార్ను రామగుండం సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినా కమిషనరేట్లో సీనియర్ ఎస్పీ సాయి అధికారి ఉండాల్సి రావడంతో రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నూతన సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పని చేయడంతోపాటు సైబరాబాద్ డీసీపీగా, అల్వాల్ డీసీపీగా, జనగాం, రాంచంద్రాపురం, అడిషనల్ ఎస్పీగా ప్రకాశం, తిరుపతిలో పని చేశారు. 1994 గ్రూప్1 అధికారిగా ఎంపికైన ఆయన అనంతరం 2004లో ఐపీఎస్గా కన్ఫర్మ్ అయ్యారు. స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాజుపల్లి. కల్వకుర్తిలో విద్యాభ్యాసం పూర్తిచేయగా, సీబీఐటీ బీఈ(సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు. అదేవిధంగా కొన్నాళ్లపాటు ఐక్యరాజ్య సమితి శాంతి దళంలో మిషనింగ్ కోసోవోలో పని చేశారు.