జ్యోతినగర్, ఆగస్టు 3: నిత్యం పోలీసు అధికారులు ఫంక్షనల్ వర్టికల్స్ను పర్యవేక్షించాలని అడ్మిన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో రామగుండం కమిషనరేట్ పరిధి సీఐలకు వర్టికల్స్పై నిర్వహించిన సమీక్షా సమావేశానికి డీసీపీ హాజరయ్యారు. ముందుగా పోలీస్ స్టేషన్లో ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును రిసెప్షన్, సెక్షన్ ఇన్చార్జిలు, 100 డయల్ స్పందన, కోర్టు సమన్స్, స్టేషన్ రైటర్, బ్లూకోల్ట్స్ వర్టికల్ అమలు తీరును తెలుసుకొని మాట్లాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి విచారణతో రిపోర్టును ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కాల్ అధికారులు, సిబ్బంది తప్పకుండా పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవాలన్నారు. వర్టికల్ ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీపై అవగాహన ఉండాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్లో 5ఎస్ అమలును పాటించాలన్నారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ట్రయల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు సాక్షులను మోటివేట్ చేసి నిందితులకు శిక్ష పడేలా మానిటరింగ్ చేయాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారులకు వారంలో ఒకసారి పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కోర్టు కేసుల స్థితిగతులు తెలుసుకొని నేరస్తులకు శిక్షపడేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఫంక్షన్, ఫంక్షనల్ వర్టికల్స్ గురించి సీఐలు, ఎస్ఐలు నిత్యం పర్యవేక్షణను కొనసాగించాలన్నారు. రామగుండం కమిషనరేట్ మొత్తం యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఒకే విధమైన సేవలు అందించాలన్నారు. రామగుండం కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన సీఐలు ఉన్నారు.