ఇల్లందకుంట, సెప్టెంబర్ 28: బీజేపీతో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నది. ధరల భారం మోపుతున్నది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నది. మీకు పన్నులు వేసేటోళ్లు కావాలా.. పనులు చేసే టీఆర్ఎస్ కావాలా..? ఆలోచించుకోవాలని’ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లందకుంటలో ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నదని, మీరంతా న్యాయం వైపే నిలబడాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో.. చేయబోతున్నదో చెబుతున్నదని, హుజూరాబాద్లో గెలిస్తే.. బీజేపీ ఏం చేస్తుందో ఎందుకు చెప్పడం లేదో ప్రశ్నించాలని సూచించారు. ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాడో ముందు చెప్పాలన్నారు.
నాలుగేళ్ల కింద సీఎం కేసీఆర్ 4వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే రాజేందర్ ఒకటి కూడా కట్టించలేకపోయాడని, పదవిలో ఉండగా చేయని వ్యక్తి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ఎంతసేపు మొసలి కన్నీళ్లు కారుస్తూ సెంటిమెంట్ డైలాగ్లు కొడుతున్నాడని మండిపడ్డారు. ఈటలను పెంచి పోషించి ఇంతటివాడిని చేసిన సీఎం కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, ఇలాంటి మాటలను ఇక్కడి ప్రజలు సహించరని తెలిపారు. తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీలో చేరిన ఈటలకు తన గెలుపు తప్ప ప్రజల గురించి అవసరం లేదని, ఇప్పుడు అదే ధోరణిలో మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతోనే గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీటీసీ విజయ్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, గ్రామ శాఖ ఇన్చార్జ్జి దేవన్న, వార్డు సభ్యులు దేవేందర్, విక్రమ్, రమేశ్, రావుల ఎల్లయ్య ఉన్నారు.