కార్పొరేషన్, మే 16: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని నగర మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. సోమవారం 45వ డివిజన్ నేత బజార్ వద్ద రూ.12 లక్షలతో డైనేజీ స్లాబ్ కల్వర్టు పనులు, 54వ డివిజన్ కశ్మీర్గడ్డలో రూ.24 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ గతంలోనే నగరానికి సీఏం అస్యూరెన్స్ కింద రూ.350 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ నిధుల నుంచి రూ.170 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి కాగా మిగితా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా టూ టౌన్ నుంచి గోదాంగడ్డ వరకు, శాలీమార్ ఫంక్షన్ హాల్ నుంచి టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు వరకు స్మార్ట్ రోడ్లుగా అభివృద్ధి చేశామన్నారు. కశ్మీర్గడ్డ రైతుబజార్ను రూ.10 కోట్ల సమీకృత మార్కెట్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దీనిలో 350 మంది వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే మారెట్ పనులకు భూమిపూజ చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పిట్టల వినోదాశ్రీనివాస్, ఇఫ్రా తహెరిన్ అథీనా, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.