చొప్పదండి, జూలై 29: బీజేపీ నేత ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు వాట్సాప్ చాటింగ్ ద్వారా దళితులను అవమానించడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం టీఆర్ఎస్ నాయకుడు మాచర్ల వినయ్ ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తే, మింగుడుపడని ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు దళితులను అవమానిస్తూ వాట్సాప్ చాటింగ్ చేయడం సరికాదని మండిపడ్డారు. దళిత సామాజిక వర్గానికి ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, దళిత సంఘం నాయకులు కొత్తూరి నరేశ్, వెంకటేశ్, నరేశ్ రావణ్, సుధాకర్, అజయ్, సుమన్, శ్రీను, శ్రీకాంత్, సంజీవ్, భూమయ్య, రవి, రత్నయ్య, అజయ్, భూమేశ్, బాబు, హరీశ్, నవీన్, అమర్ పాల్గొన్నారు.
దళితులను కించపరిచేలా వాట్సాప్ చాటింగ్ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండల దళిత నాయకులు డిమాండ్ చేశారు. మధురానగర్ చౌరస్తాలో మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. దళిత బంధు పథకంతో ఓటమి భయం పట్టుకున్న ఈటల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల మద్దతుతోనే ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారని, అలాంటి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తక్షణమే మధుసూదన్రెడ్డి దళితులకు బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు సుంకె అనిల్, ఎస్సీసెల్ అధ్యక్షుడు సముద్రాల అజయ్, ఏఎంసీ డైరెక్టర్ మ్యాక వినోద్, నాయకులు దోమకొండ మల్లయ్య, మామిడిపెల్లి అఖిల్, గంగాధర వేణు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత వ్యతిరేకి ఈటల రాజేందర్ ఖబడ్దార్ అంటూ టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు తడగొండ రాజు, సీనియర్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు దళిత నాయకులతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళితుల మనోభావాలను దెబ్బతీసేలా ఈటల రాజేందర్ దళితబంధు పథకంపై మాట్లాడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టగా, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. దళితుల పట్ల వాట్సాప్ ద్వారా అవహేళనగా మాట్లాడిన మధుసూదన్రెడ్డి తరఫున ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పూడూరు మల్లేశం, తడగొండ హన్మంతు, నర్సింబాబు, జుట్టు లచ్చయ్య, కనకయ్య, ఆరపెల్లి ప్రశాంత్, బీ సురేశ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, సర్పంచ్ పంజాల జగన్మోహన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.