ఇల్లందకుంట, అక్టోబర్ 25: ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేయాలని ఆ పార్టీ నాయకులు ప్రజలను అభ్యర్థించారు. మండల కేంద్రమైన ఇల్లందకుంటలో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో గడపగడపకూ వెళ్లి టీఆర్ఎస్కే ఓటేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమాల్లో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జనగాం జడ్పీ చైర్మన్ పాకాల సంపత్రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ జగన్నాథ్, మొగుళ్లపల్లి జడ్పీటీసీ సదానందం, సర్పంచులు రాజిరెడ్డి, రఫీఖాన్, లలిత, రజిత, మాజీ సర్పంచ్ పెద్ది స్వరూప, ఎంపీటీసీలు మోటపోతుల ఐలయ్య, ఎక్కటి సంజీవరెడ్డి, తెడ్ల ఓదెలు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, మాజీ ఎంపీటీసీ పెద్ది కుమార్, సీనియర్ నాయకులు రాజేశ్వర్రెడ్డి, దేవేందర్, ఇల్లందకుంట ఉప సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు పొడేటి కుమార్, వేణు, కందాల విక్రం, ప్రశాంత్, నాయకులు శేఖర్, కుమార్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 25: మండలంలోని చిన్నపాపయ్యపల్లిలో సోమవారం టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు వొడితల ప్రణవ్బాబు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల మద్దతు టీఆర్ఎస్కే ఉందని, ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హుజూరాబాద్ చౌరస్తా, అక్టోబర్ 25: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, సిర్సపల్లి, సింగాపూర్, మాందాడిపల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ఓటు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 25: మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో టీఆర్ఎస్వై నియోజకవర్గ కార్యదర్శి కొలిపాక అజయ్, టీఆర్ఎస్ సోషల్మీడియా ఇన్చార్జి గాలి రాకేశ్ ఆధ్వర్యంలో యూత్ నాయకుడు వొడితల ఇంద్రనీల్ వాడవాడనా ప్రచారం చేశారు. 12వ వార్డులో కౌన్సిలర్ తొగరు సదానందం ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ ప్రచారం చేయగా, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఇతర వార్డుల్లోనూ ప్రచారం కొనసాగగా, ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.