నిందితులను పట్టుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్న బృందాలు
ప్రత్యేక సమాచార వ్యవస్థతో సత్ఫలితాలు
కొత్తకోణాల్లో నిందితుల కోసం అన్వేషణ
రాంనగర్, ఏప్రిల్ 26: కొన్ని సంవత్సరాలుగా వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి త ప్పించుకొని తిరుగుతున్నవారిపై జారీ చేసిన వారెంట్లను అమలు చేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో కొనసాగుతున్న ఆపరేషన్ తలాష్ నిందితుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ఆపరేషన్ తలాష్ మార్చి 24 నుంచి ఈ నెల చివరి వరకు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారెంట్లను అమలు చేస్తూ నిందితులను అరెస్ట్ చేయడమే ధ్యేయంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతూ సఫలీకృతులవుతున్నారు. ఈ సందర్భంగా సీపీ వీబీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని మార్గాల ద్వారా నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతుందన్నారు. భయపడి న్యాయస్థానాల్లో లొంగిపోతున్నారని తెలిపారు. వారెంట్ల అమలు బృందాలు ఊహించని ఫలితాలను రాబడుతున్నాయి. ఇప్పటివరకు 113వారెంట్లలో నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 467 వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని, ఈ నెల 24న 14 వారెంట్లలో నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
చురుకుగా కరీంనగర్ టౌన్ డివిజన్ బృందం
కరీంనగర్ టౌన్ డివిజన్కు చెందిన వారెంట్ల అమలు బృందం చురుకుగా పని చేస్తున్నది. ఇప్పటివరకు 113 వారెంట్లలో 61 వారెంట్లను అమలు చేశారు. ఏఎస్ఐ ఎన్.సుజాత ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న బృందంలోని పోలీసులు బి.శంకరయ్య, యు.రమేశ్, పి.సంపత్కుమార్, బి.రాజమల్లయ్యను సీపీ కమలాసన్రెడ్డి అభినందించారు. ఏఎస్ఐ ఎన్.సుజాతను పోలీస్ కమిషనరేట్ సమన్లు, వారెంట్ల అమలు విభాగానికి ఇన్చార్జిగా నియమించారు. ఏఎస్ఐ మే 1 నుం చి బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ రూరల్ డివిజన్ ఇన్చార్జిగా ఏఎస్ఐ శంకర్సింగ్ కొనసాగుతుండగా, హెడ్ కానిస్టేబుల్ బాల్రెడ్డి, కానిస్టేబుళ్లు ఎస్.వేణుగోపాల్, శ్రీనివాస్, జనార్దన్, కనకచంద్రం, శంకర్, రవీందర్రెడ్డి బృంద సభ్యులుగా పని చేస్తున్నారు. ఈ బృందం 13 వారెంట్లలో నిందితులను పట్టుకున్నారు. హుజూరాబాద్ డివిజన్ ఇన్చార్జిగా హెడ్కానిస్టేబుల్ సదయ్య, బృంద సభ్యులుగా కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాస్, అశోక్, శ్రీనివాస్, భూమయ్య, జి.ప్రదీప్కుమార్, రామస్వామి కొనసాగుతున్నారు. ఫలితాలను రాబడుతున్న పోలీసులకు సీపీ ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు.