జగిత్యాల విద్యానగర్, ఆగస్టు 2: మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ మున్సిపల్ మార్కెట్లో చేపల మార్కెట్ అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి నిధులు రూ.15లక్షలతో చేపట్టిన నిర్మాణ పనులకు మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు చుక్క నవీన్, సిరికొండ పద్మ సింగారావు, కూసరి అనిల్, కూతురు రాజేశ్, తోట మల్లికార్జున్, పిట్ట ధర్మరాజు, బొడ్ల జగదీశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్, నాయకులు డిష్ జగన్, బండారి నరేందర్, కాశెట్టి తిరుపతి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కొండ్ర శంకర్, ఏఈ అయూబ్ ఖాన్, టీఎంసీ రజిత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.