గన్నేరువరం,జూలై28: పేదరికాన్ని రూపుమాపడ మే కేసీఆర్ సర్కారు ధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ దిశ గా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామన్నారు. బుధవారం గన్నేరువరం రైతు వేదికలో 33 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 151 మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ఆ డబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరమని పేర్కొన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారందరికీ రేషన్కార్డులు అందజేస్తామన్నారు. గతంలో కరువుతో వెలవెలబోయిన గన్నేరువరం..నేడు కాళేశ్వరం జలాల రాకతో కళకళలాడుతున్నదని చెప్పా రు. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతుండడంతో దండిగా పంటలు పండుతాయన్నారు. మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, మా జీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్రావు, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఏవో కిరణ్మయి, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, మహిళా విభా గం అధ్యక్షురాలు కుసుంబ నవీన, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, సర్పంచుల ఫోరం మండ లా ధ్యక్షుడు తీగల మోహన్రెడ్డి, సర్పంచు లు పుల్లెల లక్ష్మణ్, అటికం శారద, లింగంపెల్లి జ్యోతి, కర్ర రేఖ, పీచు చంద్రారెడ్డి, కుమ్మరి సం పత్, నక్క మ ల్లయ్య, జక్కనపెల్లి మధుకర్, నేతలు ఏలేటి చం ద్రారెడ్డి, పుల్లెల లక్ష్మణ్, గంప వెంకన్న, బూర వెం కటేశ్వర్లు, గూడూరి సురేశ్, మేరుగు రాము గౌడ్, నూనె చంద్రారెడ్డి, కయ్యం సంపత్ ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రూ. 3లక్షల ఎల్వోసీ అందజేత..
మానకొండూ ర్ మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన పల్లె పావనికి రూ. 3 లక్షల ఎల్వోసీ మంజూ రైం ది. కాగా, ఆమె తండ్రి సమ్మిరెడ్డికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన క్యాంపు కార్యాలయం లో బుధ వారం మంజూరుపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోపు రవీందర్రెడ్డి, నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, తదితరులు ఉన్నారు.