ఇల్లంతకుంట, జూలై 28: అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా ప్రభుత్వం ఉందని చెప్పారు. నమండల కేంద్రంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు రేషన్కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు పంపిణీ చేసి, మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి 250మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించామని తెలిపారు. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా లక్షానూట పదహారు రూపాయలు అందజేస్తున్నదని తెలిపారు. అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, ఈతహసీల్దార్ వావుసింగ్, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్గౌడ్, సర్పంచులు కూనబోయిన భాగ్యలక్ష్మి, మదనవ్వ, అనసూయ, ఎంపీటీసీ పుష్పలత ఉన్నారు.
శిక్షణ తరగతుల పరిశీలన
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా మండల సమాఖ్య కార్యాలయంలో స్టేట్ బ్యాంకు ఇండియా ఆధ్వర్యంలో ఇస్తున్న అగర్బత్తి తయారీ విధానాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నతంగా చదివినా.. ఉగ్యోం రాలేదని బాధపడకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి అధ్యక్షతన పల్లె ప్రగతిలో వివిధ అంశాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఏడీఆర్డీవో మదన్మోహన్, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్గౌడ్, ఎంపీడివో విజయ, ఏపీఎంం వాణిశ్రీ, ఏపీవో చంద్రయ్య, ఫ్యాకల్టీ తిరుపతిరావు, ట్రైనర్ శంకర్రావు, సీసీలు పాల్గొన్నారు.