చందుర్తి, సెప్టెంబర్ 20: అర్హులందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి ఎల్లయ్య కోరారు. మండలంలోని తిమ్మాపూర్, కొత్తపేట గ్రామాల్లో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్తో కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రదీప్, గ్రామ పంచాయతీ, ఆరోగ్యకేంద్ర సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్, సెప్టెంబర్ 20: కొవిడ్ నివారణకు అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వేములవాడ ఎంపీడీవో నరేశ్ఆనంద్ సూచించారు. సోమవారం కొడుముంజ, చంద్రగిరి, గుర్రవానిపల్లి గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. సర్పంచులు రాజ్కుమార్, రాజేశం, లక్ష్మారెడ్డి, ఏపీఎం లింగయ్య, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
రుద్రంగి, సెప్టెంబర్ 20: కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకా వేసుకోవాలని సర్పంచ్ తర్రె ప్రభలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనాపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొదటి డోసు తీసుకొని 96 రోజులు పూర్తయిన వారు రెండడో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి జైపాల్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.