జక్రాన్పల్లి, ఏప్రిల్ 3 : రాష్ట్రంలో రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు దేశానికి ఆదర్శమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గంలోనే అర్గుల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేలా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును చేపట్టిన కేసీఆర్ ప్రతిగుంటకూ సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. జక్రాన్పల్లి మండలవాసులు అదృష్టవంతులని, ప్రతి ఇంటికీ తాగునీరందించే మిషన్ భగీరథ పథకం చేపట్టేందుకు పైలెట్ మండలంగా ఎంపిక చేశారన్నారు.
మూడు ఎకరాలకు ఒక పైప్లైన్ ద్వారా సాగునీరందించే పనులకు సైతం జక్రాన్పల్లి మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేశారని, పనులు పూర్తికావొస్తున్నాయని అన్నారు. రెండు ప్రధాన జాతీయరహదారులు ఉన్న మండలంలోని ప్రధాన రోడ్లన్నీ డబుల్ రోడ్లు అవుతున్నాయన్నారు. ఇప్పటికే మండల కేంద్రం నుంచి కలిగోట్ ఎక్స్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు పూర్తయ్యిందని, మునిపల్లి నుంచి అర్గుల్ వరకు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అదే విధంగా తొర్లికొం డ ఎక్స్రోడ్డు నుంచి జాన్కంపేట్ వరకు డబుల్ రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తికాగా, పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. డబుల్ రోడ్డు పనులు కొసాగుతున్న గ్రామాల్లో ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు. అనంతరం నారాయణపేట్ నుంచి అంకాపూర్ వరకు రూ. ఒక కోటి నిధులతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అదే విధంగా మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుంచి నారాయణపేట్ వరకు, లక్ష్మాపూర్ నుంచి నల్లగుట్ట తండా వరకు రూ. రెండు కోట్ల 43 లక్షలతో బీటీ రోడ్డు మంజూరైందని, త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధిచేసే పార్టీని ప్రజలు నమ్మాలని కోరారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి, జక్రాన్పల్లి జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, తనూజారెడ్డి, ఎంపీపీ డీకొండ హరిత, వైస్ ఎంపీపీ విమల, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఏ అభిషేక్ సింగ్, సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, వైస్ చైర్మన్ నడ్పి రాజన్న, అర్గుల్ సర్పంచ్ పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భోజన్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్, నారాయణపేట్ సర్పంచ్ రబ్బ వెంకట్, ఎంపీటీసీ అను, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, సొసైటీల డైరెక్టర్లు, రైతులు తదిత రులు పాల్గొన్నారు.
ఇవికూడా చదవండి..
ఒడిశాలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ
ప్రత్యామ్నాయ వేదికగా హైదరాబాద్!
ఆ క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి