ఖలీల్వాడి: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, నగర మేయర్ నీతూ, అధికారులతో కలిసి ప్రధాన వీధుల్లో పర్యటించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శానిటేషన్, డివైడర్ మధ్యలో ఉన్న ప్లాంటేషన్ నిర్వహణ పనులను పరిశీలించారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్యూబీ పనులను, వినాయక్నగర్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిర్మిస్తున్న డివైడర్ పనులను ఆయన పరిశీలించారు.
రఘునాథ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను, అహ్మదీబజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ ఎలక్ట్రిక్ వాహనం పై నగర ప్రధార రోడ్లలో పర్యటించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, మున్సిపల్ అధికారులు ఆనంద్సాగర్, రషీద్, ఆర్అండ్బీ డీఈ ప్రవీణ్, పాంటేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.