దోమకొండ : టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ, మండల స్థాయి పార్టీ నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. బుధవారం కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ దోమకొండ మండల అధ్యక్షులుగా ఎన్నికైన గండ్ర మధుసూదన్రావు ,ఆయా గ్రామాలకు నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు,నాయకుల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విప్ నివాసం వద్ద ప్రభుత్వవిప్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పార్టీకోసం కష్టపడే కార్యకర్తకు భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ దోమకొండ మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన గండ్ర మధుసూదన్రావు,ఆయా గ్రామాల అధ్యక్షులను ప్రభుత్వ విప్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ సదానంద, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, ఎంపీటీసీలు రాజేశ్వర్, శారదానాగరాజు, రమేశ్, విండో చైర్మన్ తిరుపతిగౌడ్, విండో మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, టీఆర్ఎస్ కమిటీ సభ్యులు నవీన్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు.