ఎల్లారెడ్డి రూరల్ : పాలకుడు సమర్థుడైతే ప్రజలు సుఖపడతారని, తెలంగాణకు అటువంటి నాయకుడు సీఎం కేసీఆర్ ఉండడం అదృష్టమని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు . తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఎటువంటి లొసుగులు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. గతప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే విడతలవారీగా చేతులు తడపాల్సి వస్తుండేదని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతున్నాయని వెల్లడించారు. గతంలో ఆడపిల్లపుడితే ఎంతో భారంగా భావించే వారు. కాని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరాతో ఆడపిల్ల పుట్టడాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలంటే వారికి అన్నివిధాల చేదోడు వాదోడుగా ఉండాలని తెలిపారు.
లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా వచ్చిన చెక్కులతో పాటు సొంత ఖర్చులతో ఆడపడచు లాంఛనంగా చీరను అందజేశారు . కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పీటీసీ ఉషాగౌడ్, నాయబ్ తాసీల్దార్ సముద్రాల స్వామి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్కుమార్, నాయకులు జంగం నీలకంఠం అప్ప, నునుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.