బాన్సువాడ : బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో 5 డయాలసీస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో బుధవారం పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామానికి చెందిన వెంకటేశం అనే డయాలసిస్ రోగితో మాట్లాడి బాన్సువాడ ఏరియా దవాఖానలో డయాలసీస్ కేంద్రంలో యంత్రాల కొరత ఉన్నదని తెలుపగా వెంటన స్పందించిన స్పీకర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు.
సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. గతంలో నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూం కాలనీలో విద్యుత్ లైట్లు, తాగునీటి తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్పీకర్ వెంట గ్రామ సర్పంచ్ పీర్యానాయక్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి , నర్సింలు, దేవేందర్రెడ్డి, మన్నె చిన్న సాయిలు, సాయి, కొండ శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.