కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ ఆలయ కమిటీల చైర్మన్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆలయాల అభివృద్ధికి చేయూతను అందించాలని , దేవాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, పాలనపరంగా జరుగుతున్న ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో చుక్కాపూర్ నర్సింహాస్వామి ఆలయ చైర్మన్ నరహరి, భిక్కనూర్ సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, పంచముఖీ ఆలయ కమిటీ చైర్మన్ సబ్బని కృష్ణాచారి, దోమకొండ చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్, శివరామ ఆలయ చైర్మన్ రాజు, మాచారెడ్డి వేంకటేశ్వర ఆలయ చైర్మన్ శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.