మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో మోర్తాడ్ సీహెచ్సీ ఆవరణలో రూ.54లక్షలతో ఆక్సిజన్ తయారీ ప్లాంట్, ఇక్కడ తయారైన ఆక్సిజన్ను ఇతర దవాఖానలకు తరలించేలా సిలిండర్లలో నింపే బాటలింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఉన్నత దేశమైన అమెరికాలో సైతం ఆక్సిజన్ కొరత కారణంగా వేలాదిమంది మృత్యువాత పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఆక్సిజన్ బెడ్లు లేక, ఆక్సిజన్ లభించక చనిపోయారన్న వార్తలు వినవద్దన్న ఉద్దేశంతో మిత్రుల సహకారంతో కలకాలం ప్రజల గుండెల్లో నిలిచేలా ఆక్సిజన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. మోర్తాడ్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లో నిమిషానికి 250 లీటర్ల ఆక్సిజన్ను తయారు చేస్తుంది. ఇక్కడ తయారు చేసిన ఆక్సిజన్ను బాల్కొండ నియోజకవర్గంలోని 10 ప్రభుత్వ దవాఖానలకు, ఒక సీహెచ్సీకి సరాఫరా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలకూ ఆక్సిజన్ సరాఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి కబలిస్తున్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఇది పాత మాట..
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో ప్రభుత్వ దవాఖానాల తీరు మారుతున్నది. నిత్యం ప్రజల రాకతో ప్రభుత్వ దవాఖానలు రోగులకు సేవలందిస్తున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవతో మోర్తాడ్ సీహెచ్సీ కార్పొరేటు హాస్పిటల్కు దీటుగా మారుతున్నది. రాష్ట్రంలోనే తొలిసారి ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటలింగ్యూనిట్ను రూ.54లక్షలతో మంత్రి ఏర్పాటు చేయించడంతో మోర్తాడ్ సీహెచ్సీ ప్రత్యేకతను సంతరించుకున్నది. బాల్కొండ నియోజకవర్గానికే ఆయువుపట్టుగా మారనున్నది మోర్తాడ్ సీహెచ్సీ.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో మోర్తాడ్ సీహెచ్సీ ఆవరణలో రూ.54లక్షలతో ఆక్సిజన్ తయారీ ప్లాంట్, ఇక్కడ తయారైన ఆక్సిజన్ను ఇతర దవాఖానలకు తరలించేలా సిలిండర్లలో నింపే బాటలింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఉన్నత దేశమైన అమెరికాలో సైతం ఆక్సిజన్ కొరత కారణంగా వేలాదిమంది మృత్యువాత పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ప్రజలు ఆక్సిజన్ బెడ్లు లేక, ఆక్సిజన్ లభించక చనిపోయారన్న వార్తలు వినవద్దన్న ఉద్దేశంతో మిత్రుల సహకారంతో కలకాలం ప్రజల గుండెల్లో నిలిచేలా ఆక్సిజన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. మోర్తాడ్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లో నిమిషానికి 250 లీటర్ల ఆక్సిజన్ను తయారు చేస్తుంది. ఇక్కడ తయారు చేసిన ఆక్సిజన్ను బాల్కొండ నియోజకవర్గంలోని 10 ప్రభుత్వ దవాఖానలకు, ఒక సీహెచ్సీకి సరాఫరా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలకూ ఆక్సిజన్ సరాఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి కబలిస్తున్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల ఏర్పాటు..
మోర్తాడ్ సీహెచ్సీలో 30 పడకలు ఉండగా ఇందులో ఐదింటిని ఐసీయూ బెడ్లుగా మార్చారు. మిగతా బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చారు. ప్లాంట్ నుంచే నేరుగా బెడ్ల వద్దకు ఆక్సిజన్ అందేలా పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఐసీయూ బెడ్ల వద్ద రోగుల బీపీ, ఆక్సిజన్ లెవల్స్ను పరీక్షించేందుకు మానిటరీలను సైతం ఏర్పాటు చేశారు. మోర్తాడ్ పరిసర ప్రాంతాల్లో కొవిడ్ బారిన పడిన వారికి కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందేలా పూర్తి ఏర్పాట్లు చేశారు.
కార్పొరేట్ సౌకర్యాలు
ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ సౌకర్యాలు ఏర్పడ్డాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం తల్లడిల్లిపోయిండ్రు.. చాలా మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. అలాంటి పరిస్థితి తన నియోజకవర్గ ప్రజలకు రావొద్దనే ముందుచూపుతో మం త్రి వేముల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించడం గర్వించదగ్గ విషయం. ఈ పనితో ప్రజలకు ఏమైనా చేయాలన్న తపన, ప్రజలను కాపాడుకోవాలన్న ఆలోచన మంత్రిలో ఉన్నట్లు మరోసారి స్పష్టమయ్యింది.
ప్రభుదాస్, తిమ్మాపూర్
మార్చురీ ఏర్పాటుకు చర్యలు
మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలో మార్చురీ ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. పోస్టుమార్టం కోసం ఆర్మూర్ వరకూ వెళ్లాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి ఇబ్బందులు దూరం కావాలంటే మార్చురీ ఏర్పాటు తప్పనిసరి అని ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి మార్చురీ ఏర్పాటుకు రూ.12.50లక్షలు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు
నీటి శుద్ధి యంత్రం
మోర్తాడ్ సీహెచ్సీలో గంటకు వంద లీటర్ల నీటినిశుద్ధి చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దవాఖానలకు వచ్చే ప్రజలకు మంచినీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని, కార్పొరేటు హాస్పిటల్లో ప్రజలకు ఏవిధంగా సౌకర్యాలు ఉంటా యో ఆవిధంగా ఇక్కడ కూడా ఉం డాలని మంత్రి సూచించడంతో నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు
సంతోషంగా ఉంది
మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటలింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల ఆరోగ్యంపై మంత్రికి ఉన్న ఆరాటం ఎలాంటిదో తెలుస్తున్నది. ఇలాంటి నాయకుడు మా నాయకుడని చెప్పుకోవడం కూడా మాకు సంతోషంగా ఉంది. దవాఖాన రూపురేఖల్ని మార్చేసిన మంత్రికి కృతజ్ఞతలు.
బద్దం రవి, జడ్పీటీసీ మోర్తాడ్
అడగ్గానే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు
మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలో మార్చురీ ఏర్పాటు చేయాలని విన్నవించిన వెంటనే స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఏండ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేరు.
శివలింగు శ్రీనివాస్, ఎంపీపీ మోర్తాడ్
రిసెప్షన్ ఏర్పాటు..
మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ తరహాలో రిసెప్షన్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దవాఖానకు వచ్చిన వారికి సూచనలు ఇచ్చేలా, వచ్చిన వారు కూర్చుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దవాఖానకు వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వచ్చిన వారితో మంచిగా మాట్లాడి వారి మానసిక ఆందోళనను దూరం చేసేలా రిసెప్షన్ను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు.