ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 5 : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్తండా వద్ద గల మోడల్ డిగ్రీ కళాశాలను గురువారం న్యాక్ బృందం సందర్శించింది. కళాశాలకు వచ్చిన బృందానికి ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకుల బృందం, విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం కళాశాల గురించి ప్రిన్సిపాల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బృందం సభ్యులు కళాశాలలోని ల్యాబ్లు, డిపార్ట్మెంట్లు, లైబ్రరీని పరిశీలించారు. అనంతరం కళాశాలలోని విద్యార్థులు, పేరెంట్స్తో విడివిడిగా సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. వర్షం నీరు వృథా పోకుండా నిర్మించిన ఇంకుడు గుంత, బొటానికల్ గార్డెన్, వసతిగృహాలు, కళాశాల గ్రౌండ్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. న్యాక్ బృందంలో చైర్పర్సన్, ఉత్తరాఖండ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన హోషియార్ ధమి, బెంగుళూర్ యూనివర్సిటీ నుం చి వచ్చిన న్యాక్ కో- ఆర్డినేటర్ డాక్టర్ సీతమ్మ, మహారాష్ట్ర నుంచి వచ్చిన బృందం సభ్యుడు డాక్టర్ వినాయక్ పాటిల్ ఉన్నారు. కార్యక్రమంలో గణిత అధ్యాపకుడు సిద్ధిరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.