రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి
ఆర్మూర్, ఆగస్టు 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం లో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి కోరారు. రాజ్యసభలో కాలుష్య నియంత్రణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ ప్రశ్నించారు. రైతులు వరి పొలం వేసిన తర్వాత వదిలేసే గడ్డిని కాల్చివేసే విషయంలో రైతులకు జరిమానా విధిస్తున్నట్లు సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. కాలుష్య నియంత్రణ కోసం చేసిన చట్టంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని దానికి జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఈ చట్టం విషయంలో జరిమానాలకు గురవుతున్న రైతులను కాపాడేందుకు తప్పకుండా కాలుష్య నియంత్రణ చట్టాన్ని సవరించాలని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ సురేశ్రెడ్డి కోరారు.