నిజాంసాగర్, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలతోపాటు మంజీరా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సం దర్శించారు. ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్తోపాటు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోండడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నదని తెలిపారు. గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగిందన్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కన్నా అధికంగా నీటిని విడుదల చేస్తుండగా..నాగిరెడ్డిపేట మండలంలో పంటలు నీట మునిగే అవకాశం ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్పారన్నారు. వేసవికాలంలో కొండ పోచమ్మసాగర్, హల్దీవాగు ద్వారా నిజాంసాగర్లోకి నీటిని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ద్వారా ఆరు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా ప్రధాన కాలువ పనులు ప్రారంభించారని తెలిపారు. మొత్తం 23 కిలోమీటర్ల మేర కాలువ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పునరావాస కేం ద్రాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు ఉండాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రైతులు సాగు చేస్తున్న ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, దొడ్డు రకం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఏ రాష్ట్రం కొనుగోలు చేయనప్పటికీ మన రాష్ట్రం వడ్లు కొనుగోలు చేసిందని అన్నా రు. రైతులు వరి కాకుండా ఇతర ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. ఎస్ఈ మధుసూదన్, ఈఈ సోలోమాన్, డీఈఈ శ్రావ ణ్, ఏఈ శివ, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి ఉన్నారు. అంతకుముందు జుక్క ల్ ఎమ్మె ల్యే షిండే జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు.