డిచ్పల్లి, సెప్టెంబర్ 25: ఆర్టీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు ఆదివారం వస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్కు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ సెక్రెటరీ శనివారం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 9గంటలకు బాజిరెడ్డి గోవర్ధన్ తన నివాసం కోకాపేట్ నుంచి బయల్దేరుతారు. 11.30 గంటలకు ఇందల్వాయి మండలం చాంద్రాయన్ పల్లి వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కాన్వాయితో గన్నారం కమాన్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆర్టీసీ చైర్మన్కు స్వాగతం పలికి భారీ గజమాలతో సన్మానిస్తారు. 12గంటలకు డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లితెలంగాణ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఎగురవేస్తారు. 12.40 గంటలకు బర్ధిపూర్ శివారులోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. 2.30 గంటలకు బర్ధిపూర్ శివారులోని సుగుణ గార్డెన్లో కార్యకర్తలతో మాట్లాడి భోజనం ముగించుకుంటారు. జిల్లాకు అధికార హోదాలో వస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్కు 44వ నంబర్ జాతీయ రహదారి పొడవున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద స్వాగతం పలుకుతూ రోడ్డుకు ఇరువైపులా పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.