నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేటినుంచి నుంచి ఆదివారం (24,25,26) వరకు మూడు రోజులపాటు ఆటో షో నిర్వహించనున్నారు. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ హాజరు కానున్నారు. ఈ మెగా మేళాకు అందరికీ ప్రవేశం ఉచితం. ఆటో షో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు రోజులపాటు కొనసాగనున్నది.
ఖలీల్వాడి, సెప్టెంబర్ 23: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి ఆదివారం (24,25,26 ) వరకు మూడు రోజులపాటు ఆటో షో నిర్వహించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్ మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నడూ లేని విధంగా ప్రముఖ ఆటోమ్బైల్ ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ హాజరుకానున్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.
తక్షణ రుణ సౌకర్యం
జాతీయ, కార్పొరేట్ సంస్థలు అక్కడికక్కడే రుణ సదుపాయం కల్పించనున్నాయి. ప్రముఖ వెంకటేశ్వర హీరో, మారుతీ సుజికీ వరుణ్ మోటర్స్, సాయిరాం హోండా, ఎన్ ఎస్ మోటర్స్, నిక్సా మారుతీ సుజికీ, జేఎన్ మోటర్స్, శ్రీ వెంకటేశ్వర మోటర్స్, లక్ష్మీ నిసాన్, ఆర్ఆర్ఆర్ మోటర్స్, కెనారా బ్యాంక్, బెనాలి బైక్స్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్, మెర్సిడెజ్ బెంజ్, స్కోడా, ఎస్ మోటర్స్, పీడీఎన్ఆర్ యమహా, ప్రకాశ్ హుందాయ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గ్రీన్హోండా తదితర కంపెనీల షోరూం నిర్వాహకులు కార్లను అందుబాటులో ఉంచనున్నారు. రోజువారీ బుకింగ్లపై లక్కీడ్రా ద్వారా బహుమతులు అందజేయనున్నారు. బుకింగ్ కోసం 9182777399, 9182777590 నంబర్లను సంప్రదించవచ్చు. ఆటో షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు.