డిచ్పల్లి, అక్టోబర్ 22: మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ ఈటీఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి బాట చూపిస్తోంది. వివిధ రకాల ఉపాధి శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు ఈ శిక్షణ సంస్థ వారి ఉపాధికి బాటలు వేస్తోంది. వారు జీవితంలో స్థిరపడేలా చక్కని అవకాశాలు కల్పిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు నేర్పించడంతోపాటు వ్యక్తిత్వ వికాసం, యోగా, ధ్యానం, నైపుణ్యాల పెంపు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.దీంతోపాటు మహిళలకు కరాటేలో ప్రత్యేక తరతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్తోపాటు టూల్ కిట్ ఇస్తారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 276 బ్యాచ్లలో ఏడువేల మందికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం 5000 మంది ఉపాధి పొందుతూ జీవితంలో స్థిరపడ్డారు. సుమారు రెండు వేల మందికి పైగా అభ్యర్థులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి, వారు సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే సంస్థ ప్రోత్సహించింది.
జ్యూట్ బ్యాగుల తయారీతో ఉపాధి
ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐలో జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణ పొందాను. ఇప్పుడు ఇంటి వద్ద జ్యూట్ బ్యాగులు తయారు చేసి విక్రయిస్తున్నాను. ప్లాస్టిక్ బ్యాగుల వాడకంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. అందుకే పలువురు జ్యూట్ బ్యాగులను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. తద్వారా నాకు నెలకు సుమారు రూ.20వేల ఆదాయం లభిస్తోంది.
కుటుంబానికి ఆర్థికంగా ఆసరా
ఇక్కడ నేర్చుకున్న సెల్ఫోన్ రిపేర్, సీసీ కెమెరాలు, ఏసీ రిపేర్, ఎలక్ట్రిషియన్, బైక్ రిపేర్ తదితర అంశాలపై శిక్షణ తీసుకొని ఎంతో మంది యువకులు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఆర్థికంగా వారి కుటుంబాకు అండగా ఉంటున్నారు. మహిళలు కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ఆర్టిఫిషియల్ ఆభరణాలు, జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా ఎంతో మంది వ్యాపారాలు పెట్టుకుని తమ సొంతకాళ్లపై నిలబడ్డారు.
రూ.15 నుంచి 18 వేలు సంపాదిస్తున్నాను..
నేను డిచ్పల్లిలోని శిక్షణ కేంద్రం లో సెల్ఫోన్ రిపేరింగ్ కోర్సు శిక్షణ పూర్తి చేశాను. ప్రస్తుతం సొంత రిపేరు షాపు ఏర్పాటు చేసుకొని నెలకు రూ.15 నుంచి 18 వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను.
ఉచిత శిక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ గురించి నిజామాబాద్, కామారెడ్డి జి ల్లాల్లోని గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ శిక్షణకు చాలా డిమాండ్ ఉంది. ప్రతి గ్రామంలో సీసీ టీవీ కెమెరాలు బిగిస్తున్నారు. దీంతో ఈ శిక్షణ నేర్చుకున్న వారికి మంచి గిరాకీ ఉం టుంది. ఒక కెమెరా అనేది ఒక పోలీస్తో సమా నం. చాలా దొంగతనాలు కంట్రోల్ అవుతాయి. ఈ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎంతోమంది జీవితంలో స్ధిరపడ్డారు.
ఇతర అంశాలనూ నేర్పిస్తాం..
నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు నేర్పించడంతోపాటు వ్యక్తిత్వ వికాసం, యోగా, ధ్యానం, నైపుణ్యాల పెంపు తదితర అంశాల్లో ప్రత్యేక తరతులు నిర్వహిస్తాం. వీటితో పాటు మహిళలకు సెల్ప్ డిఫెన్స్లో భాగంగా కరాటే లో శిక్షణ ఇస్తున్నాం. ఆయా కోర్సుల్లో శిక్షణ తర్వాత సర్టిఫికెట్ పాటు టూల్ కిట్ అందజేస్తున్నాం.
-రామకృష్ణ (ఫ్యాకల్టీ అండ్ కోర్సు కో-ఆర్డినేటర్)
ఉపాధి దొరికింది..
నేను గతంలో ఉపాధి కోసం పలుచోట్ల పనిచేశాను. బతుకుదెరువు కోసం గల్ప్ దేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ డిచ్పల్లిలో స్వయం ఉపాధి కోసం శిక్షణ నిస్తున్న ఆర్ఎస్ఈటీఐ సంస్థ గురించి తెలిసి ఇందులో చేరాను. సీసీ కెమెరాలు బిగించడం, మరమ్మతు కోర్సులో శిక్షణ పొందాను. శిక్షణ పూర్తి చేసుకున్న ఆనంతరం గ్రామంలోనే ఉపాధి లభించింది. ప్రస్తుతం గ్రామాల్లో సీసీ కెమెరాల వినియోగం పెరిగినందున వినియోగదారుల ఇంటి వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను బిగిస్తూ ఉపాధి పొందుతున్నాను.
శిక్షణలో చేరాలంటే..