తూప్రాన్/ రామాయంపేట, సెప్టెంబర్ 22: ‘తూప్రాన్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏడున్నర ఏండ్లల్లో రూ.103 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేశాం. ప్రస్తుతం తూప్రాన్ మున్సిపాలిటీలోని అంతర్గత సీసీ డ్రేన్లకు, సీసీ రోడ్లకు, బీటీ రోడ్డుకు నూతనంగా రూ.6.30 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. దీంతో ప్రగతికి చిరునామాగా తూప్రాన్ కేంద్రం వెలుగొందుతున్నది’. అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రేన్లకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం బస్టాండు వద్ద మొక్కలు నాటి నూతనంగా వైకుంఠ రథాన్ని ప్రారంభించి ఎంపీ మాట్లాడారు. తూప్రాన్ పట్టణం, మండలాన్ని నందనవనంగా తయారు చేస్తామన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఇంకా అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు. కాళ్లకల్ నుంచి జాతీయ రహదారులపై రామాయంపేట, రెడ్డిపల్లి ప్రాంతాల్లో త్వరలోనే ైప్లెఓవర్ బ్రిడ్జిలకు శంకుస్థాపనలు, ప్రమాదాల నివారణకు హైవేపై న్యూ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే తూప్రాన్ మండలం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్ కోరిక మేరకు సీఎం వద్దకు వెళ్లి ప్రగతికి నిధులు తెస్తానన్నారు. తూప్రాన్ పట్టణంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో గడా అధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, డివిజన్ వ్యవసాయశాఖ సంచాలకులు సురేఖ, కమిషనర్ మోహన్, మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, పట్టణాధ్యక్షుడు సతీశ్చారి, ఎంపీడీవో అరుంధతి, తాసీల్దార్ శ్రీదేవి, ఏవో నుస్రత్, ఎంపీపీ గడ్డి స్వప్న, జడ్పీటీసీ రాణి, కౌన్సిలర్లు రఘుపతి, ఉమ, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, సత్యలింగం, వెంకటేశ్ యాదవ్, మున్సిపల్ సిబ్బంది ఆర్ఐ రమేశ్, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, వినోద్ తదితరులున్నారు.
ఆదర్శ గ్రామంగా లింగారెడ్డిపేట నిలవాలి..
మనోహరాబాద్, సెప్టెంబర్ 22: అభివృద్ధి పనుల్లో లింగారెడ్డిపేట ఆదర్శ గ్రామంగా నిలువాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిపేటలో రూ.20 లక్షలతో నిర్మించబోయే మురికి కాల్వ పనులకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామం నుంచి రాజరాజేశ్వర దేవాలయం వరకు రోడ్డును మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ భిక్షపతి, సర్పంచ్ శివ్వగోని సుగుణమ్మ, ఎంపీటీసీ నవనీత, పార్టీ సీనియర్ నాయకుడు పెంటాగౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
తూప్రాన్ మండలం మల్కాపూర్కి చెందిన నర్సింలు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు మంజూరైన రూ.36 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు భగవాన్రెడ్డి, సర్పంచ్ మహదేవినవీన్, వార్డుసభ్యులు ఆంజనేయులు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు స్వామి, నాయకులు రాజు, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.