డిచ్పల్లి, అక్టోబర్ 19 : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలకు తెరలేపిన వీసీ రవీందర్గుప్తా నియామకాలు చేపట్టలేదని వ్యా ఖ్యానించడం ఆయన అక్రమాలకు నిదర్శనమని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. యూనివర్సి టీ మెయిన్ గేటు ఎదుట మంగళవారం వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీ యూ పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ వి ద్యార్థి సంఘాలపై వీసీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అక్రమ నియామకాల అంశాన్ని పక్కదోవపట్టించేందుకు వీసీ విద్యార్థి సంఘాల నాయకులపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దళితుడిని రిజిస్ట్రార్గా నియమించినందునే ఉద్యమిస్తున్నారని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. అక్రమ నియామకాలను తాము ఆధారాలతో నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతారా?అని వీసీకి సవాల్ విసిరారు. వివాదం ము గియాలంటే అక్రమ నియామకాలను రద్దుచేసి ప్ర భుత్వం, పాలకమండలి అనుమతితో ఉద్యోగాలను భర్తీచేయాలన్నారు. స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రిజర్వేషన్లు కూడా పాటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పులి జైపాల్, ఎల్బీ రవి, పిల్లి శ్రీకాంత్, పుప్పాల రవి, శ్రీనివాస్, చరణ్, ప్రదీప్, మహేశ్రెడ్డి పాల్గొన్నారు.